జేఈఈ లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్ నియోజవర్గ పరిధిలోని డిచ్ పల్లి మండలం వెస్లీ తండా గ్రామానికి చెందిన సునీత-రాజశేఖర్ దంపతుల కుమారుడు శ్రీషరాన్ ఇటీవల విడుదల జేఈఈ మెయిన్స్ లో Air విభాగంలో 606 ర్యాంకు సాధించడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో సదరు విద్యార్థి వెస్లీ నగర్ తండా సర్పంచ్ విజయ్ చౌహాన్ నేతృత్వంలో ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారాచంద్ నాయక్ ఉన్నారు.

























