కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వైయస్ఆర్ జయంతి వేడుక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అందరూ నివాళులు అర్పించారు.రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.ఆయన సేవలు పథకాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి అంటే ఎంత గొప్ప ఆలోచనలతో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ముఖ్య అతితిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రైబ్యునల్ మెంబెర్ వేణుగోపాల్ యాదవ్ హాజరు అయ్యారు.ఈ కార్యక్రమంలో ఏ ఏం సి ఛైర్మెన్ పాలేపు నర్సయ్య ,మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేటా రవి ,డీసీసీ నాయకులు ఏలేటి మోహన్ రెడ్డి ,మురళి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కురి దేవేందర్ , లక్ష్మణ్,బద్దం రాజేశ్వర్, మాజీ ఎంపీపి గుడిసె అంజమ్మ,సర్పంచులు నలిమేలా గంగారెడ్డి ,అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్ ,నరేష్ రవీందర్ ,భూమేష్ ,చింటురెడ్డి ,యూత్ ఉపాధ్యక్షలు షైలెందర్ ,జగదీష్ కొమ్ముల రవీందర్ ,బుచ్చిమల్లయ్య ,నిమ్మ ప్రసాద్, దశరథ్,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.























