నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో దృశ్యాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చిరుత పులి కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన రైతు ధర్మాయి శ్రావణ్కు చెందిన కోళ్ల ఫారాన్ని అర్ధరాత్రి సమయంలో చిరుత పులి చేరుకుంది. ఫారంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చిరుతను అక్కడ ఉన్న కుక్కలు గట్టిగా మొరగడంతో అది వెనుదిరిగినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఫారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత జాడను గుర్తించి, గ్రామ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

























