ఊర పండుగకు ఆరెత్తిన భీంగల్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ పట్టణంలో 9 సంవత్సరాల తర్వాత ఈ నెల 12 ఆదివారం రోజున నిర్వహించే ఊర పండుగ కొరకై గురువారం ఆరెత్తే కార్యక్రమానికి నాంది పలికారు. స్థానిక మైసమ్మ గద్దెకు చేరుకొని భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ, సలహా కమిటీ సభ్యులు మైసమ్మకు కొబ్బరికాయలు కొట్టి బృందాలు బృందాలుగా బయలుదేరి సాయిత్యాన్ని సేకరించారు. సాయిత్యం ఇస్తే గ్రామదేవతల చల్లని చూపు ఉంటుందని మహిళలు తమ ప్రగాఢ విశ్వాసంతో సాహిత్యం తో పాటు ద్రవ్యాన్ని ఇచ్చారు. పట్టణంలోని పలు వీధుల గుండా కమిటీ సభ్యులు, పోతరాజులు సంచరించారు. పోతరాజులు ఇంటిల్లాదులకు బండారు నుదుట ధరింపజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ మాట్లాడుతూ ఉర పండుగను 9 సంవత్సరాల క్రితం చేశారు. పట్టణ సర్వతో ముఖాభివృద్ధికి ఊర పండగలు ఉపయుక్తమవుతాయి. మీ అందరి ఆర్థిక సహాయ సహకారాలు ఉండాలని పట్టణ ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తీగల రఘు, ప్రధాన కార్యదర్శి నిచ్చెమోల్ల రాజేశ్వర్, కోశాధికారి ఎస్పీ భూమేశ్వర్, కమిటీ సభ్యులు, సలహా కమిటీ సభ్యులు, గ్రామదేవతల పూజారులు బద్దం శ్రీనివాస్, బద్దం శివకుమార్ బృందం, పట్టణ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.























