హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలకు ఎల్ఈడీ టీవీ విరాళం…
ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ స్కూళ్ల స్థాయి సౌకర్యాలు కల్పించాలి – మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జేజే లత
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ పట్టణంలోని హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఎల్ఈడీ టీవీని స్పాన్సర్గా అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జేజే లత మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ వాడలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి నాణ్యమైన విద్యను అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెప్పల గణేష్, గల్లీ పెద్దమనుషులు చింతలూరి సంతోష్, దుమాల గంగాధర్, హరిజనవాడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

























