భీమ్గల్:ఊర పండగకు సర్వ సిద్ధం సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు పతని కృష్ణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ పట్టణంలో ఆదివారం నిర్వహించే ఊర పండుగకు సర్వం సిద్ధం చేసినట్లు సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ తెలిపారు.ఉదయం చెట్టు కొట్టడం,విగ్రహాల చెక్కల ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు.అనంతరం భూలక్ష్మి గుడి వద్ద ప్రత్యేక పూజలు,సాయంత్రం గొర్రెపోతు గావు పట్టడం,రాత్రి 10 గంటలకు మైసమ్మ గుడివద్ద ముగింపు పూజలు ఉంటాయని పేర్కొన్నారు.ప్రజలందరూ పాల్గొని పండుగను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.























