రేపు ప్రైవేట్ సమీకృత ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభం…
తెలంగాణ : రాష్ట్రంలో సమీకృత ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నిర్మించింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా 700 మందికి వరకు ఉపాధి లభించనుంది. ఇప్పటికే నర్సరీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.























