పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించే చర్యలు చేపట్టారు.
పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో సర్పంచ్ మాలావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలు, గడ్డిపై మందు పిచికారీ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవింద్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.

























