ధర్పల్లిలో ఎస్ఐఆర్పై గ్రామసభ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, జీపీ వీఓ సునీల్ తెలిపారు.
ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితాలోని వివరాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునే విధానం, ఓటర్ల జాబితాలో పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు, మార్పులు ఉంటే వాటిని సరిచేసుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాకేష్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వీఐడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, వార్డు వీఐడీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

























