భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
శుక్రవారం నాడు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపిక, శ్రీకృష్ణ వేషాధారణలో 70 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు స్వయంగా తయారు చేసుకొని రావడం జరిగింది. ఈ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు మరియు గోపిక వేషాధరణలో వచ్చిన బాలికలు ఉట్టిని లాగుతూ ఉంటే శ్రీకృష్ణ వేషాధరణలో వచ్చిన బాలురు ఉట్టిని పగలగొట్టే సన్నివేశాలు ప్రజలందరినీ కనువిందు చేశాయి. అలాగే పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు నిజంగా రేపల్లెలో శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరిస్తున్నారా అనే విధంగా అబ్బురపరిచాయి. శ్రీకృష్ణ, గోపిక వేషాధరణలో వచ్చిన విద్యార్థులకు పాఠశాల ప్రధాన కార్యదర్శి శ్రీ జి. నర్సయ్య , విద్వత్ సమితి సంయోజక్ యెన్ను శ్రీధర్ విద్యార్థుల తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించి మెమొంటోలను అందజేస్తూ కృతజ్ఞతలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి. బసంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.నర్సయ్య , విద్వత్ సమితి సంయోజక్ యెన్ను శ్రీధర్, ప్రధానాచార్యులు పైడిమర్రి సాయి చరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ నోముల అశ్విన్ రెడ్డి, ఈ కార్యక్రమానికి విద్యార్థులు సంసిద్ధం చేసిన మాతాజీలు వై లయశ్రీ, పి లహరి ఆచార్యులు పి. రాజేందర్, వై చంద్రశేఖర్, పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

























