వన మహోత్సవ కార్యక్రమన్ని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఘనంగా ప్రారంభించిన పురపాలక సంఘం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు భీంగల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ డి.గజానంద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి హాజరై కౌన్సిలర్లతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పట్టణ ప్రజలు మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు వృక్షాలు ఎంతో అవసరమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చంటి లత నర్సయ్య, కౌన్సిలర్లు ఆరెపల్లి శ్రీజ నాగేంద్రబాబు, పర్స కుశలత అనంతరావు, తోట సతీష్, గున్నాల బాలలక్ష్మీ ,బోదిరే లావణ్య నర్యయ్య. అంజుమ్ అలీ, సందీప్,నీలం రవి,సంగ్యా నాయక్,మల్లెల అనుపమ ప్రసాద్,మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది ,మెప్మా, సిబ్బంది మహిళా సంఘాల ప్రతినిధులు కస్తూర్బా పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.























