నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు..
Jul 08, 2026, గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దాదాపు 200 పాయింట్ల నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 592 పాయింట్ల నష్టంతో 77,588 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనిస్తూ, 178 పాయింట్ల నష్టంతో 24,220 వద్ద కదలాడుతోంది. కల్యాణ్ జువెల్లర్స్, ఇన్ఫోఎడ్జ్, జైడూస్ లైఫ్, ఇండస్ టవర్స్, వోడాఫోన్ ఐడియా షేర్లు లాభాల్లో ఉండగా, హిందుస్థాన్ పెట్రో, బీపీసీఎల్, ఎంఫసిస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.























