ప్రధాని మోదీ పిలుపు మేరకు భీమ్గల్లో ఘనంగా తిరంగా ర్యాలీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్గల్ 11 మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.
భీమ్గల్ పట్టణంలోని సుదర్శన్ థియేటర్ వద్ద నుంచి సుమంగళి చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజలు, యువత, మహిళలు, శ్రీ సరస్వతి విద్య మందిర్ ఉన్నత పాఠశాల, శ్రీ నారాయణ పాఠశాలల విద్యార్థులు మరియు వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలను చేతబట్టి భారత్ మాతాకీ జై, వందే మాతరం నినాదాలతో దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ మాట్లాడుతూ…. జాతీయ జెండా మన గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి భావాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు.
కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేసినందుకు నిర్వాహకులు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యోగేశ్వర నరసయ్య, కైరి దశ గౌడ్,బండారి లక్ష్మణ్ గౌడ్,కునే రాజేశ్వర్,తోట గంగాధర్, కొట్టాల అశోక్, పతాని ప్రవీణ్, శెట్టి ప్రేమ్చంద్,డాక్టర్ నవీన్, దయ్య ప్రవీణ్, ఈర్ల మహేందర్, ధర్పల్లి మహిపాల్, రాజేష్ గుప్తా, నీలం గంగాధర్,శెట్టి లక్ష్మణ్, ప్రమోద్, యోగిని శ్రీనివాస్, ఈశ్వర్ సాయి,ముమ్మారి గంగాధర్, డాక్టర్ వెంకటేష్, డిస్ చారి,శుక్రవారం గంగాధర్, యువకులు, వివిధ పార్టీల నాయకులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు..

























