బేలియా తండాలో మన సంరక్షణ కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన గ్రామస్తులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం బేలియా తండాలో సర్పంచ్ రావుజి నాయక్ ఆధ్వర్యంలో మన సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిసరాల్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రావుజి నాయక్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పచ్చదనంతో కళకళలాడేలా చేయడంతో పాటు భవిష్యత్లో మరిన్ని మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






















