డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం ఎగ్జామినేషన్
డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం ఎగ్జామినేషన్ – 2026, తేది : 25-5-2026 నుండి తేది : 31-5-2026 వరకు కలదు, నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ డైట్ మల్లారం , ప్రభుత్వ హైస్కూల్ ఖిల్లా యందు పరీక్ష కేంద్రాలు గలవు. అట్టి పరీక్ష కేంద్రముల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తేది : 25-5-2026 నుండి తేది : 31-5-2026 వరకు డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం ఎగ్జామినేషన్ – 2026
పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ నగరంలో మొత్తం 2 ఎగ్జమినేషన్ సెంటర్ లలో పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. పరీక్షలు జరిగే రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్షా కేంద్రము పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 BNSS (పాత సెక్షన్ 144 సి.ఆర్.పి.సి ) అమలులో ఉంటుందని వెల్లడించారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధం. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పరీక్ష కేంద్రాలలో తేది:-25-5-2026 నుండి తేది 31-5-2026 వరకు (ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు) సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు , జిరాక్స్ షాపులు మరియు స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయబడుతుందని , కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., విద్యార్థులకు “ ఆల్ ది బెస్ట్ ” తెలిపారు.

























