సర్పంచే గొడవలు సృష్టిస్తే ఎలా… సర్పంచ్ పై అధికారులకు ఫిర్యాదు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూన్ 27 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీలో ఒక భాగమైన మంతెన పంత సభ్యులంతా స్థానిక సర్పంచ్ సిలిండర్ లింగం పై ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎస్ఐలకు ఫిర్యాదు చేశారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ముంగట గల గ్రామ చావిడి ( కచీరు) స్థలంలో గ్రామపంచాయతీ తీర్మానంతో మహిళా సంఘ భవన నిర్మాణం కొరకు గుంతలు చేయడం జరిగింది. అయితే గ్రామ అభివృద్ధి కమిటీ లో ఒక భాగమైన మంతెన పంత సభ్యులంతా ఆ మహిళా భవన నిర్మాణం చేపట్టదంటూ గుంతలు పూడ్చడంతో ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లేసరికె గ్రామపంచాయతీ కమిటీకి మంతెన పంత కు గొడవ ప్రారంభమైంది. దీంతో శనివారం మంతెన పంత సభ్యులంతా కలిసి గ్రామ సెక్రెటరీ, సర్పంచ్ పై ఎంపీడీవో, ఎమ్మార్వో ఎస్సైలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంతెన పంత అధ్యక్షులు మంతెన శ్రీను మాట్లాడుతూ గత వంద సంవత్సరాలుగా గ్రామపంచాయతీ దగ్గర గల గ్రామచావిడి ని గ్రామ అభివృద్ధి కమిటీ ఎక్కువగా ఉపయోగించుకునేదని, ఇప్పుడంటే గ్రామం పెద్దగా అయింది కానీ, నందిపేట గ్రామం మొత్తం ఈ చావిడి చుట్టుపక్కల నే ఉండేదని, ఇంతకుముందు రెవెన్యూ ఆధీనంలో ఉన్న చావిడి గ్రామకంఠంలోకి వెళ్లిందని, 2023 సం.లో సిడిపి 10 లక్షల రూ. నిధులతో అప్పటి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి తో మంజూరు చేయించుకోవడం జరిగిందని. మాకు కేటాయించిన భూమిలో మళ్లీ ఇప్పుడు మహిళా మండలం పేరుతో సర్పంచ్ నిర్మాణాలు చేపడుతూ… కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడని, గ్రామ సర్పంచ్ అంటే గొడవలు మొదలయితే మాన్పాలే గాని ఇలా పంతల మధ్య గొడవలు సృష్టించడం, వారి పైన కేసులు నమోదు చేయించడం సరికాదని, తప్పకుండా ఇది కక్ష సాధింపేనని విమర్శించారు. మహిళా భవనం నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదని, మాకు ఉన్నదే కొద్ది స్థలమని, గ్రామంలో వీడిసి చేసే పనులు ఎన్నో ఉన్నాయని, అనాదిగా వస్తున్న ఆచారాలను, పండుగ పబ్బాలను చేసేది వీడిసే నని, గ్రామ నడిబొడ్డులో గల వ్యాన్లు అడ్డను కాపాడింది కూడా వీడిసేనని, అధికారులు గ్రామపంచాయతీ కమిటీ అందరూ అమ్ముడుపోయిన వీడీసీ ఒక్కటే పోరాడిందని గుర్తుంచుకోవాలని అన్నారు. మాకు అందుబాటులో ఉన్న ఈ కాస్త స్థలాన్ని వేరే వాళ్ళకు కేటాయించడం నచ్చకనే ఈరోజు మూడు పంతలలో రెండు పంతలైన మంతెన పంత, ప్యాట్ల పంత సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా సర్పంచ్, పంచాయతీ కమిటీ సభ్యులు వి డి సి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తు పెట్టుకొని ఆ స్థలాన్ని వీడీసీకే చెందేటట్టు చూడాలని విజ్ఞప్తి చేశారు.























