ధర్పల్లిలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుకలు…
బుధవారం : 01/07/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సేవలను ప్రజలకు అంకితం చేస్తూ నిరంతరం సేవలందిస్తున్న వైద్యుల సేవలను కొనియాడుతూ కేక్ కట్ చేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, వైద్య వృత్తి అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్యుడి ప్రధాన కర్తవ్యమని అన్నారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందని, సేవాభావంతో ప్రజలకు వైద్యం అందించడమే నిజమైన డాక్టర్ లక్షణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శివశంకర్, ఆయుష్ వైద్య సిబ్బంది, టీబీ (క్షయవ్యాధి) విభాగం స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొని వైద్యులకు జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

























