సీజన్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అసిస్టెంట్ కలెక్టర్.
బుధవారం : 01/07/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
పురపాలక సంఘం, భీంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ పామురి, ఐఏఎస్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా భీంగల్ మున్సిపాలిటీని ఈ రోజు పర్యటించారని కమిషనర్ డి. గజానంద్ తెలిపారు. శిక్షణలో భాగంగా మున్సిపల్ ర్యాలయము నందు సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆ శాఖకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో జరుగుచున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే రాబోయే వర్షాకాలము దృష్ట్యా ప్రజలకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రజలకు తడిచెత్త పొడి చెత్త పై అవగాహనా కల్పించాలని ఆదేశించినారు. ఇట్టి కార్యక్రములో చైర్ పర్సన్ బోదిరే నాగమణిస్వామి. వైస్ చైర్ పర్సన్ సంటి లతనర్సయ్య.మరియు కౌన్సిలర్లు ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ పామురి, ఐఏఎస్ ని సన్మానించడం జరిగిందని కమీషనర్ గజానంద్్ తెలిపారు.























