NEET, JEE ప్రవేశాలకు 50శాతం మార్కుల వెయిటేజీ!
నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు, బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఈ మేరకు ప్రవేశ పరీక్షల విధానంలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన మూల్యాంకన లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అవకతవకల నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు వస్తున్నట్లు సమాచారం. దీనిపై విద్యాశాఖ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.























