ధర్పల్లి గ్రామ ప్రజలకు ముఖ్యమైన ప్రకటన
శనివారం : 04/07/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, **ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)**లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపే కార్యక్రమం రేపు ఉదయం 10:00 గంటలకు ధర్పల్లి ZPHS పాఠశాలలో నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శాంత మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వాలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఫారాలు నింపడంలో సహాయం చేయబడుతుంది.
తప్పనిసరిగా తీసుకురావాల్సిన పత్రాలు:
– ఓటరు గుర్తింపు కార్డు (Voter ID)
– ఆధార్ కార్డు
– పాస్పోర్ట్ సైజ్ ఫోటో
కావున ధర్పల్లి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, అవసరమైన పత్రాలతో హాజరై ఫారాలు నింపించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.






















