గ్రామ పంచాయతీ సూచనలు పాటించకుంటె చర్యలు తప్పవు – సర్పంచ్ బెజ్జారం రాకేష్…
సోమవారం : 06/07/26/త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బెజ్జారం రాకేష్ అధ్యక్షతన గ్రామంలో ఉన్న మేస్త్రి లతో సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు, ఇతర కట్టడాలు చేపట్టాలని అన్నారు .ఒకవేళ నిబంధనలు అతిక్రమించి నిర్మాణం జరిపితే తగిన జరిమానా మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.కొత్తగా కట్టే ఇండ్లకు ఎవరు కూడా డ్రైనేజీ అంట నీయకుండా ,ప్రతి ఇంటికి సెట్ బ్యాక్ ఉండాలని,గ్రామ పంచాయతీ పరిమిషన్ లేకుండా ఎటువంటి నిర్మాణం చేయ రాదని తెలిపారు .కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సుధాకర్ గ్రామ సెక్రెటరీ శ్రీలత,ఉప సర్పంచ్ బాలేరావ్ శంకర్,వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.























