టీవీ షోకు తీసుకెళ్తామని చెప్పి మహిళపై అత్యాచారం.
సికింద్రాబాద్ రాణిగంజ్లో దారుణం చోటుచేసుకుంది.
వరకట్న వేధింపుల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
టీవీ కార్యక్రమానికి వెళ్లేందుకు వచ్చిన ఆమెన, టీవీ ఆఫీసుకు తీసుకెళ్తామని నమ్మించి, మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో మోసం చేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

























