రాత పరీక్ష లేకుండా ఆర్మీలో 350 ఇంజినీరింగ్ పోస్టులు, వార్షిక వేతనం రూ.18 లక్షలు…
భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు కోసం 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అవివాహిత ఇంజినీరింగ్ పురుష గ్రాడ్యుయేట్లు అర్హులు కాగా, పరీక్ష లేకుండా అకడమిక్ మార్కులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైతే లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం, నెలకు సుమారు రూ.1.5 లక్షల వరకు జీతం పొందవచ్చు..🤟🏽























