ఆర్ఎస్ ప్రవీణ్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని CMకు లేఖ…
తెలంగాణ : సీఎం రేవంత్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లేఖ రాశారు. గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఉన్నప్పుడు 2013-2021 మధ్య రూ.10 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. టెండర్లు లేకుండా నిధులు ఖర్చు, నియామకాలు, క్రమబద్ధీకరణలో డబ్బు దండుకున్నారని, ఐఐటీ, జేఈఈ కోచింగ్ పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్ అండతోనే ప్రవీణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ప్రవీణ్ కుమార్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.























