గోనుగొప్పుల ప్రభుత్వ పాఠశాలలకు రూ.5 లక్షల విలువైన 100 డిస్క్ బెంచీల విరాళం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మండలంలోని గోనుగొప్పుల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బుధవారం రూ.5 లక్షల విలువైన మొత్తం 100 డిస్క్ బెంచీలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 50 డిస్క్ బెంచీలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 50 డిస్క్ బెంచీలు అందించారు. ఈ బెంచీలను లిటిల్ రెడ్ జాంబీస్ మరియు రోటరీ క్లబ్, సికింద్రాబాద్ వారి తరఫున గుమ్మడి శ్రీనివాస్, ప్రవీణ్ లునావత్ ఆధ్వర్యంలో పంపించారు.
గోనుగొప్పుల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఎస్పీ సీహెచ్ రవీందర్ రెడ్డి, సీహెచ్ విజేందర్ రెడ్డి గత ఆరు నెలలుగా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన డిస్క్ బెంచీల కోసం తీర్మానాల ప్రతులను సంబంధిత సంస్థలకు అందజేసి నిరంతరం కృషి చేశారు. వారి ప్రయత్నాల ఫలితంగా రెండు డీసీఎం వాహనాల ద్వారా ఈ డిస్క్ బెంచీలు పాఠశాలలకు చేరాయి.
ఈ సందర్భంగా గోనుగొప్పుల గ్రామ ప్రజల తరఫున, రెండు ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాల తరఫున డిస్క్ బెంచీలను అందించిన లిటిల్ రెడ్ జాంబీస్, రోటరీ క్లబ్ సికింద్రాబాద్ ప్రతినిధులు, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిపై గోనుగొప్పుల శ్రీ హరిహర దేవాలయ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

























