ధర్పల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లీ, జూలై 16: ధర్పల్లి మండల కేంద్రంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం సుందరంగా అలంకరించిన రథంపై శ్రీ జగన్నాథ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. వేద మంత్రోచ్ఛారణలు, భజనలు, కోలాటాల నడుమ సాగిన రథయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
























