మేడ్చల్ పోలీస్ సర్కిల్ లో అంజిరెడ్డి బాధ్యతలు స్వీకరణ…
మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోగా పనిచేసిన అద్దాని సత్యనారాయణను సీపీ కార్యాలయానికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో లింగంపల్లి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి శుక్రవారం మేడ్చల్ సర్కిల్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ, మేడ్చల్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.























