కృష్ణా జిల్లా : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో పర్యటించారు…
‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేకేఆర్ గౌతమ్ స్కూల్ను సీఎం చంద్రబాబు సందర్శించారు.
తమ పాఠశాలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు విద్యార్థులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా, స్కూల్ ప్రాంగణంలో బల్క్ వేస్ట్ జనరేటర్లను, డైనింగ్ హాల్, వంటశాల, ఆహార తయారీ విభాగం, డంపింగ్ ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
అనంతరం, స్కూల్ యాజమాన్యానికి ‘బల్క్ వేస్ట్ జనరేటర్’ ధృవపత్రాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు.

























