శుక్రవారం నాడు విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయండి – సేపూర్ చరణ్ గౌడ్...
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని, నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక 152 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి అని బాల్కొండ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్ ఆరోపించారు.
*రేపటి బంద్ కు ప్రధాన డిమాండ్స్.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.
– ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన NTAను రద్దు చేయాలి.
– నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి.
– విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవలి.
– విద్యార్థులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి.
ఈ ప్రధాన డిమాండ్ తో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రేపటి విద్యా సంస్థల బంద్ కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని, విద్యార్థి సంఘాల తరుపున విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటి బంద్ కు విద్యాసంస్థల బంద్కు సహకరించాలని, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల మేనేజ్మెంట్ కూడా సహకరించాలి అని కోరుతున్నాను.
సేపూర్ చరణ్ గౌడ్..బాల్కొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు.

























