గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం…
తహసీల్దార్ కిరణ్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్గల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై మంగళవారం మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కిరణ్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ, భూ సమస్యలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పట్టాదారు పాస్బుక్స్కు సంబంధించిన అంశాలు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పలు పరిపాలనా సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సర్పంచులు కోరారు.
విన్నపాలను శ్రద్ధగా ఆలకించిన తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచులు ప్రస్తావించిన ప్రతి సమస్యను పరిశీలించి, నిబంధనల మేరకు దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.
తహసీల్దార్ ను సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆరిగేల జనార్దన్, వివిధ గ్రామాల సర్పంచులు రమేష్, తిరుపతి, రాజ రెడ్డి, దుమల రాజు, కార్తీక్, పిండి అశోక్, వసంధర్ నాయక్, గణేష్, సేవాలాల్ తమ గ్రామాల సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు.

























