పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు..
చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ సందేశంతో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు చిన్నోళ్ల రజనీకాంత్ హాజరై మట్టి వినాయకుల ప్రాధాన్యతను వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి వినాయకులను పూజించాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు బీజేపీ అధ్యక్షులు పెద్దోళ్ల గోపాల్ పట్టణ కార్యవర్గ సభ్యుడు సరికొండ ప్రభాకర్, కాలనీ వాసులు, సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను పలువురు అభినందించారు.

























