కొడిచర్లలో మట్టి గణపతుల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కొడిచర్ల గ్రామంలో 2010 సంవత్సరపు 7వ తరగతి పూర్వ విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని ప్రజలకు సూచిస్తూ, వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏ. లక్ష్మణ్, పి. నరేందర్, కె. బీరప్ప, బి. రవికుమార్, పి. భూమేష్, ఎన్. బస్వంత్, ఎం. పవన్, కె. శంకర్, పి. గంగాధర్, బి. శ్రీధర్, పి. అర్జున్, కె. గంగాధర్, డి. మచందర్, సి.హెచ్. రాజు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను స్వీకరించారు.

























