విద్యుత్ షాక్తో వ్యవసాయ కూలీ మృతి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన మనమల భాస్కర్ (45) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. సుమారు మూడు నెలల క్రితం కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం కలిగోట్ గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 13న సాయంత్రం 4 గంటల సమయంలో కలిగోట్ గ్రామ శివారులోని బొమ్మెడ, మేదరి కిష్టయ్యకు చెందిన వ్యవసాయ పొలంలో పంట గట్లపై పచ్చిగడ్డి కోసేందుకు భాస్కర్ వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో గడ్డి కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కొడవలితో బోర్ మోటార్ సర్వీస్ వైర్ను కోయడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న జక్రాన్పల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య మనమల విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జక్రాన్పల్లి ఎస్ఐ తెలిపారు.

























