వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి పట్టణం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు సీఐ నరహరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని వినాయక ఉత్సవ మండలి నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.
గణేశ్ మండపాల ఏర్పాటులో ట్రాఫిక్కు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. మండపాల వద్ద డీజేలను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో, వాట్సాప్ ద్వారా వచ్చే వదంతులు, అసత్య సమాచారాన్ని ఎవరూ షేర్ చేయవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఎదురైతే వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
విద్యుత్ కనెక్షన్లు, ఇతర ఏర్పాట్ల విషయంలో తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ప్రతి గణేశ్ మండపం వద్ద ఒకరు లేదా ఇద్దరు వాలంటీర్లను నియమించుకుని భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా అనుమానాస్పద సంఘటన కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సీఐ నరహరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

























