పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు…
శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఓపీ గణపతి విగ్రహాలకు బదులుగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.
నేడు ఉదయం 7:30 గంటల నుంచి విగ్రహాలను ఉచితంగా అందజేయనున్నారు. ప్రజలు మట్టి గణపతి విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు.
విగ్రహాలు అవసరమైన వారు 9848854411 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

























