నర్సయ్య కుటుంబానికి రూ.51,500 ఆర్థిక సహాయం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్పల్లి, సెప్టెంబర్ 16: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన నాకిడి నర్సయ్య గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న గల్ఫ్ చేయూత సంఘం సభ్యులు నర్సయ్య కుటుంబానికి అండగా నిలిచారు. గల్ఫ్ చేయూత సంఘం తరఫున బుధవారం నర్సయ్య కుటుంబ సభ్యులకు రూ.51,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నర్సయ్య కుటుంబానికి తమ వంతు సహాయం అందించి, కుటుంబానికి అండగా ఉంటామని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ చేయూత సంఘం సభ్యులు పాల్గొన్నారు.

























