కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నూతనంగా ప్రారంభమైన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కనీస సౌకర్యాలు లేక కోర్టుకు వచ్చే బాధితులు, కక్షిదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు ప్రాంగణంలో త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, కూర్చునేందుకు కుర్చీలు తదితర కనీస వసతులు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నూతనంగా ప్రారంభమైన కోర్టులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలని, కోర్టు యాజమాన్యం, సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

























