ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: ధర్పల్లి గ్రామ సచివాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 33 నెలల్లో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాకేష్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























