బీజేవైఎం కామారెడ్డి జిల్లా ఇంచార్జి గా డిచ్ పల్లి మండల వాసికి కీలక బాధ్యత…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
కామారెడ్డి జిల్లా బీజేవైఎం ఇంచార్జీ గా డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన పానుగంటి.సతీష్ రెడ్డి నియామితులయ్యారు.ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు.కుందే గణేశ్ ప్రకటన విడుదల చేశారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ కామారెడ్డి జిల్లా ఇంచార్జి గా నియమించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు.రామచందర్ రావు, పార్లమెంటు సభ్యులు ధర్మపురి. అరవింద్,ఇందూరు బిజెపి అధ్యక్షులు.కులాచారి. దినేష్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి,కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అనుక్షణం విద్యార్థుల సమస్యల పైన పోరాడుతామన్నారు. ఇచ్చిన బాధ్యతను బాధ్యతగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి తెలిపారు…..























