Homeడిచ్ పల్లి మండల్భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారిణులు...

భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారిణులు…

భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారిణులు…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్


నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రతిభావంతమైన క్రీడాకారిణులు భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు ఎంపికయ్యారు. డిచ్‌పల్లి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలకు చెందిన దయ్యాల లిఖిత (సుద్దపల్లి), ఈర్నాల వర్షిణి (ధర్మారం–బి) తమ ప్రతిభతో భారత జట్టులో స్థానం సంపాదించారు.

ఈ విషయాన్ని జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి తెలిపారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన దయ్యాల లిఖిత, ధర్మారం–బి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన ఈర్నాల వర్షిణి భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 12 నుంచి 18 వరకు చైనాలోని వెయిహైలో నిర్వహించనున్న సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల ఏషియా కప్ పోటీల్లో దయ్యాల లిఖిత, ఈర్నాల వర్షిణి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు.

భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులను సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల నిజామాబాద్ జోనల్ ఆఫీసర్ యుగంధర లక్ష్మి, ధర్మారం–బి పాఠశాల ప్రిన్సిపల్ మాధవలత, సుద్దపల్లి పాఠశాల ప్రిన్సిపల్ టి. నళిని ఘనంగా సన్మానించి అభినందించారు.

క్రీడాకారిణులను ఈ స్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన ధర్మారం–బి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నీరజ రెడ్డి, పీఈటీ స్వప్న, సుద్దపల్లి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్, పీఈటీలు జ్యోత్స్న, నర్మదా, అకాడమీ కోచ్ మౌనికలను ఈ సందర్భంగా అభినందించారు.

జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు భారత సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...
Translate »
error: Content is protected !!