నందిపేట్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్కు స్థలం కేటాయించాలని వినతి…
నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటు కోసం అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు.
Clearance of Land for Plastic Waste Management Unit (PWMU) ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని ఆయన సబ్ కలెక్టర్ను కోరారు.
తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎర్రం లింగం తెలిపారు.
డంపింగ్ యార్డ్తో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటు చేస్తే గ్రామంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మెరుగుపడి, పారిశుధ్య సమస్యలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ యూనిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

























