ఎంపీ ధర్మపురి అరవింద్ను కలిసిన రామన్నపేట సర్పంచ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్
వేల్పూర్: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ను రామన్నపేట గ్రామ సర్పంచ్ బేల్దారి నవీన్ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
వేల్పూర్ నుంచి రామన్నపేట బస్టాండ్ వరకు రహదారి సమస్యను ఎంపీకి వివరించగా, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి రహదారి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అలాగే రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీ.ఈ.టీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) కొరత ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయంపై డీఈఓతో మాట్లాడినట్లు తెలిపారు.
గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఎంపీకి వివరించారు. దీనిపై సంబంధిత డీఎంఓతో మాట్లాడి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, జాగిరపు కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఎలుక శ్రీనివాస్ గౌడ్, కల్లెడ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

























