చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల భౌతిక పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.
ఎంపీడీవో మారుతి ఆధ్వర్యంలో అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలు, అర్హతలను పరిశీలించారు. దరఖాస్తుల్లో పేర్కొన్న సమాచారం, ఆధార్ తదితర అవసరమైన పత్రాలను తనిఖీ చేసి వివరాలను నమోదు చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి, వారికి చేయూత పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ భౌతిక పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

























