పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండలం సీతాయిపేట్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద శుక్రవారం యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
యజ్ఞ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొండ్యాల వినోద్, చిలుక నరేష్, రవి దంపతులు, సంఘ పెద్దలు, కుల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
అలాగే ధర్పల్లి సీతాయిపేట్ పద్మశాలి సంఘ కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

























