రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం తొర్లికొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని డొల్ల పల్లవి 11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైంది.
ఈ నెల 2న సుద్దపల్లి గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక పోటీల్లో డొల్ల పల్లవి పాల్గొని ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైంది. అనంతరం ఈ నెల 14 నుంచి 18 వరకు సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొని ప్రతిభ కనబరిచింది.
దీంతో ఈ నెల 19, 20 తేదీల్లో కమ్మర్పల్లి మినీ స్టేడియంలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు డొల్ల పల్లవి ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మార్కంటి గంగా మోహన్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన డొల్ల పల్లవిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, జక్రాన్పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజ్, వీవీసీ/వీడీసీ అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్లవి ప్రతిభ కనబరచాలని వారు ఆకాంక్షించారు.

























