విశారదన్ మహారాజ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన కమ్మర్పల్లి మండల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నేత గుర్రం నరేష్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
జగిత్యాల జిల్లా నూకపల్లి లో అర్బన్ డబుల్ బెడ్రూం కాలనీ వాసుల సమస్యల కోసం వెళ్లి అక్కడ అనేక సమస్యలు ఉన్నాయని తెలుసుకొని, వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులతో కలిసి శాంతియుత ధర్నా కు కూర్చున్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు డా. విశారదన్ మహారాజ్ ను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కమ్మర్పల్లి మండల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుడు గుర్రం నరేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపి ప్రజా అవసరాలు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని గుర్తు చేస్తూ డా.విశారదన్ మహారాజ్ గారు ప్రజల పక్షాన పోరాడితే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. విశారదన్ మహారాజ్ గారు రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్లి న్యాయం కోరిన ప్రతి సారి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు ఎందుకు.? ప్రభుత్వాలే ప్రజలకు సరిగా పనులు చేస్తే ఇలాంటి ధర్నాలు ఎవరు ఎందుకు చేస్తారు అని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం నూకపల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల వాసులకు,ప్రజలకు వసతులు కల్పించడం పట్ల బాధ్యత వహించాలని అన్నారు .అలాగే విశారదన్ మహారాజ్ అరెస్ట్ కు నిరసనగా నేడు జగిత్యాల బంద్ కు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ & ధర్మాసమాజ్ పార్టీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.























