గంటల వ్యవధిలోనే అదృశ్యమైన బాలుడి గుర్తింపు
కమ్మర్పల్లి పోలీసుల సమర్థవంతమైన చర్యలు – తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగింత
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15), తండ్రి సతీష్, గురువారం (06.08.2026) ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే కమ్మర్పల్లి ఎస్సై సీహెచ్. సతీష్ స్పందించి, కానిస్టేబుళ్లు నరేష్, దినేష్, హరీష్లతో కలిసి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి బాలుడి కదలికలను గుర్తించారు.
కేవలం గంటల వ్యవధిలోనే బాలుడు ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడిని క్షేమంగా కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో బాలుడిని వారికి సురక్షితంగా అప్పగించారు.
ఫిర్యాదు చేసిన వెంటనే వేగంగా స్పందించి తమ కుమారుడి ఆచూకీ గుర్తించి క్షేమంగా అప్పగించిన కమ్మర్పల్లి ఎస్సై సీహెచ్. సతీష్తో పాటు పోలీస్ సిబ్బంది నరేష్, దినేష్, హరీష్లకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.























