భీంగల్ మున్సిపాలిటీలో కార్మికులకు దుస్తులు, రేడియం జాకెట్ల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు దుస్తులు, రేడియం జాకెట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ కార్మికులకు దుస్తులు, రేడియం జాకెట్లను అందజేశారు. రాత్రి వేళల్లో, రోడ్లపై విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు రేడియం జాకెట్లు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజుమ్ అలీ, సందీప్, సంగ్య నాయక్, తోట సతీష్ పాటు ప్రజాప్రతినిధులు జె జె నరసయ్య, ఆరేపల్లి నాగేంద్ర, పర్స అనంతరావు, నరసయ్య తదితరులు పాల్గొని కార్మికులకు దుస్తులు, రేడియం జాకెట్లను పంపిణీ చేశారు.
మున్సిపల్ కార్మికులు పట్టణ పరిశుభ్రత కోసం ప్రతిరోజూ అందిస్తున్న సేవలను ప్రజాప్రతినిధులు అభినందించారు. కార్మికుల సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

























