నందిపేటలో ఘనంగా నాగుల పంచమి….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…
ప్రకృతిలోని ప్రతి ప్రాణిని ప్రేమించే ఆచారం హైందవ ధర్మంలో అడుగడుగునా కనబడుతుంది. చెట్టును, పుట్టను పంచభూతాలను కనబడే ప్రతి ప్రాణిలో దైవం ఉందంటూ ప్రేమను కనబరుస్తారు హిందువులు.
అటువంటి పండుగే ఈ నాగుల పంచమి పండగ. ఈ పండుగ రోజు ఆడపడుచులు ఉదయాన్నే స్నానం చేసి నియమ నిష్ఠలతో ఉపవాస దీక్ష చేపట్టి పాముల పుట్ట వద్దకు వెళ్లి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి నాగదేవత ఆశీస్సులు తీసుకుంటారు. నాగుల పంచమి రోజు భూమిని దవ్వకూడదని, ఆకు కూరలను కొయ్యకూడదని, పిండిని విసరకూడదనే అనాదిగా వస్తున్న ఆచారాలతో భూమిని తల్లిగా పామును రక్షకుడిగా భావించి గౌరవిస్తారు. పాముకు పూజిస్తే సంతానం కలుగుతుందని మహిళలకు అపార నమ్మకం, అలాగే ఆ మహాదేవునికి పాము అత్యంత ప్రీతి పాత్ర మైనది అందుకే పామును దైవంతో సమానంగా పూజిస్తారు హైందవులు. ఇంతటి మహత్తరమైన ప్రకృతిని ఆరాధించే పండుగ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఆలయాల పుట్టల వద్ద, గ్రామ శివారు ప్రాంతాలలో గల పుట్టల వద్ద మహిళలు బారులు తీరారు.

























