ధర్పల్లి ప్రజా బస్టాండ్లో ప్రజా మరుగుదొడ్ల ప్రారంభోత్సవం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రజా బస్టాండ్ ప్రాంగణంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లను సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ సౌకర్యాన్ని ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడమే ధర్పల్లి లక్ష్యమని తెలిపారు. బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు, స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ మరుగుదొడ్ల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజా ఆస్తులను పరిశుభ్రంగా కాపాడుకోవాలని కోరారు.
అయితే ఈ మరుగు దొడ్ల వాడకానికి, నీళ్లు, మరియు క్లినింగ్ చేసి పరిశుభ్రంగా ఉంచాటానికి మెంటానేన్స్ కొరకు. మూత్రశాలలు వినియోగించు వారు 2 రెండు రూపాయలు మరుగుదొడ్లు వినియోగించు వారు 10.పది రూపాయలు చెల్లించి పరి శుభ్రత కు సహకరించాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు సభ్యులు మంచికంటి ప్రశాంత్, మజిత్, విజయ-చక్రపాణి, పిండి మమతా-రాజకుమార్, ములుగు లలిత-నవీన్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ. ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

























